Border Gavaskar Trophy 2023: వరుసగా నాలుగోసారి బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత్, 2–1తో సిరీస్‌ వశం చేసుకున్న టీమిండియా, ఆఖరి మ్యాచ్ డ్రా

భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు రోజుల్లో ముగిసిన గత టెస్టులకు భిన్నంగా ఆఖరి మ్యాచ్‌ ‘డ్రా’ అయ్యింది. 2–1తో సిరీస్‌ను వశం చేసుకున్న టీమిండియా ‘బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ’ని వరుసగా నాలుగోసారి చేజిక్కించుకుంది. నాలుగో టెస్టు చివరి రోజు ఫలితానికి అవకాశం లేకపోవడంతో గంట ముందే ‘డ్రా’కు ఇరుజట్ల కెప్టెన్లు అంగీకరించారు

Team India players (Photo Credits: PTI)

భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు రోజుల్లో ముగిసిన గత టెస్టులకు భిన్నంగా ఆఖరి మ్యాచ్‌ ‘డ్రా’ అయ్యింది. 2–1తో సిరీస్‌ను వశం చేసుకున్న టీమిండియా ‘బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ’ని వరుసగా నాలుగోసారి చేజిక్కించుకుంది. నాలుగో టెస్టు చివరి రోజు ఫలితానికి అవకాశం లేకపోవడంతో గంట ముందే ‘డ్రా’కు ఇరుజట్ల కెప్టెన్లు అంగీకరించారు. విరాట్‌ కోహ్లికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించగా... స్పిన్‌తో భారత్‌కు సిరీస్‌ విజయాన్నిచ్చిన బౌలింగ్‌ ద్వయం అశ్విన్‌–రవీంద్ర జడేజాలకు సంయుక్తంగా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు ఇచ్చారు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఈనెల 17న ముంబైలో జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement