Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం
ఒలింపిక్స్ లో భారత్ కు బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు.
Newdelhi, Aug 28: ఒలింపిక్స్ లో (olympics) భారత్ కు బంగారు పతకం (Gold Medal) అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా (Neeraj Chopra) మరో చరిత్ర సృష్టించాడు. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. క్వాలిఫైయర్స్లో నీరజ్ ఈటెను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆ తరువాత ఫైనల్స్ తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో మారు జావెలిన్ను 88.17 మీటర్లు విసిరాడు. ఆ తరువాత వరుసగా 86.32, 84.64, 87.73, 83.98, మీటర్ల దూరానికి విసిరాడు.
Advertisement
సంబంధిత వార్తలు
Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు
RBI To Tighten Gold Loan Processes: బంగారం రుణాలు తీసుకోవడం ఇక అంత సులభమేమీ కాదు! గోల్డ్ లోన్ విషయంలో నిబంధనలను కఠినతరం చేయనున్న ఆర్బీఐ
Jayalalithaa Assets list: జయలలిత ఆస్తులు చూస్తే షాకే..27 కిలోల బంగారం, వజ్రాలు, రత్నాలు,1672 ఎకరాలు.. ఇంకా ఎన్నో, వివరాలివే!
Gold Price: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధర, ఏకంగా తులం రూ. 89వేలకు చేరి సరికొత్త రికార్డ్
Advertisement
Advertisement
Advertisement