Tokyo Olympic Games 2020: టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్‌లోకి అడుగుపెట్టిన భారత రెజ్లర్లు, 57 కిలోల విభాగంలో రవి కుమార్‌, 86 కిలోల విభాగంలో రెజ్లర్‌ దీపక్‌ పునియా విజయం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే 86 కిలోల విభాగంలో రెజ్లర్‌ దీపక్‌ పునియా సెమీస్‌ చేరగా.. తాజాగా రెజ్లింగ్‌ పురుషుల 57 కిలోల విభాగంలో రవి కుమార్‌ సైతం సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టాడు.

Wrestlers Ravi Dahiya, Deepak Punia (Photo-Twitter)

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే 86 కిలోల విభాగంలో రెజ్లర్‌ దీపక్‌ పునియా సెమీస్‌ చేరగా.. తాజాగా రెజ్లింగ్‌ పురుషుల 57 కిలోల విభాగంలో రవి కుమార్‌ సైతం సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. క్వార్టర్‌ ఫైనల్‌లో బల్గేరియాకు చెందిన వాలెంటినో వాగేలోవ్‌ను 14-4 తేడాతో ఓడించి రవి సెమీస్‌కు దూసుకెళ్లాడు. ఒలింపిక్స్‌ ఆడిన తొలిసారే సెమీ ఫైనల్‌ చేరిన ఆటగాడిగా రవి ప్రత్యేకత చాటుకున్నాడు.రెజ్లింగ్‌ పురుషుల 86 కిలోల విభాగం క్వార్టర్‌ ఫైనల్‌లో ప్రత్యర్థి రెజ్లర్‌ జూషన్‌ను 6-3 తేడాతో ఓడించి భారత రెజ్లర్‌ దీపక్‌ పునియా సెమీ ఫైనల్‌ చేరుకున్నాడు. సెమీస్‌లో అతడు అమెరికాకు చెందిన డేవిడ్‌ మోరిస్‌తో తలపడనున్నాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement