Pulichinthala Dam: కృష్ణానది వరద ఉధృతి.. ఊడిపోయిన పులిచింతల ప్రాజెక్టులోని గేట్, ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు, నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

Pulichinthala Dam -Technical Problem | Twitter Photo

కృష్ణానది వరద ఉధృతి ఎక్కువగా ఉంది, ఈ క్రమంలో పులిచింతల ప్రాజెక్టులో ఓ గేట్ ప్రమాదవషాత్తూ ఊడిపోయింది. నీటిని విడుదల చేసే క్రమంలో పులిచింతల ప్రాజెక్టులోని 16వ గేట్ సాంకేతిక సమస్యతో ఊడిపోయింది. ఊడిపోయిన ఈ గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయనున్న అధికారులు. దీని కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి పెరగనున్న వరద‌ ఉధృతి. ఈ నేపథ్యంలో కృష్ణా , గుంటూరు జిల్లా అధికారయంత్రంగం అప్రమత్తమైంది. నదిపరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నదిదాటే ప్రయత్నం చేయరాదని రాష్ట్ర విపత్తుల శాఖ  కమిషనర్ కె.కన్నబాబు ప్రజలను హెచ్చరించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement