COVID in AP: ఏపీలో గత 24 గంటల్లో 14,440 మందికి కరోనా, అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,258 కేసులు, అనంతపురం జిల్లాలో 1,534 కేసులు నమోదు

ఏపీలో గడచిన 24 గంటల్లో 46,650 శాంపిల్స్ పరీక్షించగా 14,440 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. విశాఖ జిల్లాలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,258 కేసులు వెల్లడి కాగా, అనంతపురం జిల్లాలో 1,534 కేసులు, గుంటూరు జిల్లాలో 1,458 కేసులు నమోదు అయ్యాయి.

Coronavirus in India (Photo Credits: PTI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 46,650 శాంపిల్స్ పరీక్షించగా 14,440 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. విశాఖ జిల్లాలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,258 కేసులు వెల్లడి కాగా, అనంతపురం జిల్లాలో 1,534 కేసులు, గుంటూరు జిల్లాలో 1,458 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,399 కేసులు, కర్నూలు జిల్లాలో 1,238 కేసులు గుర్తించారు. అదే సమయంలో 3,969 మంది ఆరోగ్యవంతులు కాగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,80,634 మందికి కరోనా సోకగా, వారిలో 20,82,482 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 83,610 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,542కి పెరిగింది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement