Corona in AP: ఏపీలో కొత్తగా1,623 మందికి కోవిడ్, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 342 కొత్త కేసులు, రాష్ట్రంలో ప్రస్తుతం 15,158 యాక్టివ్ కేసులు

ఏపీలో గడచిన 24 గంటల్లో 65,596 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,623 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 342 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 276, నెల్లూరు జిల్లాలో 194 కేసులు నమోదయ్యాయి

A resident gets tested for coronavirus in the Liwan District in Guangzhou in southern China (Photo: PTI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 65,596 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,623 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 342 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 276, నెల్లూరు జిల్లాలో 194 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 16 కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,340 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,21,325 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,92,256 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,158 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 13,911కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement