Coronavirus in AP: ఏపీలో కొత్తగా 184 మందికి కరోనా పాజిటివ్, కృష్ణా జిల్లాలో అత్యధికంగా 34 కొత్త కేసులు నమోదు

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 25,925 కరోనా పరీక్షలు నిర్వహించగా, 184 మందికి పాజిటివ్ అని తేలింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 34 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 30, విశాఖపట్నం జిల్లాలో 26, పశ్చిమ గోదావరి జిల్లాలో 21, తూర్పు గోదావరి జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1 కేసు నమోదయింది. అదే సమయంలో 134 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,909 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 20,56,318 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,149 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,442కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now