Corona in AP: ఏపీలో కొత్తగా 286 మందికి కరోనా పాజిటివ్, చిత్తూరు జిల్లాలో 53 మందికి పాజిటివ్, రాష్ట్రంలో ముగ్గురి మృతి
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 37,540 కరోనా పరీక్షలు నిర్వహించగా, 286 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 53 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 37, విశాఖ జిల్లాలో 36, కృష్ణా జిల్లాలో 34, పశ్చిమ గోదావరి జిల్లాలో 33, గుంటూరు జిల్లాలో 30 కేసులు వెల్లడయ్యాయి.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 37,540 కరోనా పరీక్షలు నిర్వహించగా, 286 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 53 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 37, విశాఖ జిల్లాలో 36, కృష్ణా జిల్లాలో 34, పశ్చిమ గోదావరి జిల్లాలో 33, గుంటూరు జిల్లాలో 30 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 307 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,69,352 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,51,747 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,196 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,409కి పెరిగింది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)