Corona in AP: ఏపీలో అమాంతం పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 3,205 మంది కరోనా, విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 695 కేసులు నమోదు

ఏపీలో కరోనా థర్డ్ వేవ్ పంజా విసురుతోంది. పాజిటివ్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,205 మంది కరోనా బారిన పడ్డారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 695 కేసులు నమోదు కాగా.. కడప జిల్లాలో అత్యల్పంగా 42 కేసులు నమోదయ్యాయి.

Coronavirus in India (Photo Credits: PTI)

ఏపీలో కరోనా థర్డ్ వేవ్ పంజా విసురుతోంది. పాజిటివ్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,205 మంది కరోనా బారిన పడ్డారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 695 కేసులు నమోదు కాగా.. కడప జిల్లాలో అత్యల్పంగా 42 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 281 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 20,87,879కి చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా నుంచి 20,63,255 మంది కోలుకోగా... 14,505 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement