Corona in AP: ఏపీలో కొత్తగా 326 కేసులు నమోదు, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు, కర్నూలు జిల్లాలో కేసులు నిల్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 326 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లాలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది.

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 326 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లాలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు కరోనా కారణంగా మృతి చెందారు. 466 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు ఏపీలో నమోదైన కేసుల సంఖ్య 20,67,255కి పెరిగింది. ఇప్పటి వరకు 20,48,971 మంది కోలుకోగా... 14,386 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,898 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement