Corona in AP: కర్నూలు జిల్లాలో జీరోకి పడిపోయిన కరోనా కేసులు, ఏపీలో కొత్తగా 567 మందికి కరోనా, తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 161 కేసులు నమోదు

ఏపీలో గత 24 గంటల్లో 39,545 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 567 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 161 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

Coronavirus outbreak | (Photo Credits: IANS)

ఏపీలో గత 24 గంటల్లో 39,545 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 567 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 161 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది మృతి చెందారు. 437 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు 20,64,854 కేసులు నమోదు కాగా... 20,45,713 మంది కోలుకున్నారు. మొత్తం 14,364 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,777 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement