Corona in AP: ఏపీలో కొత్తగా 59 మందికి కరోనా, అనంతపురం జిల్లాలో అత్యధికంగా 28 కొత్త కేసులు

Coronavirus test (Photo-ANI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 10,914 కరోనా పరీక్షలు నిర్వహించగా, 59 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 28 కొత్త కేసులు నమోదయ్యాయి. కడప, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 83 మంది కరోనా నుంచి కోలుకున్నారు కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మృతి చెందారు. కరోనా వ్యాప్తి మొదలయ్యాక రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,943 మంది కరోనా బారినపడగా, వారిలో 23,03,690 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 523 మంది చికిత్స పొందుతున్నారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement