Corona in AP: ఏపీలో మూడు జిల్లాల్లో కేసుల నిల్, గణనీయంగా తగ్గి జీరోకి చేరుకుంటున్న కోవిడ్, గత 24 గంటల్లో 71 మందికి కరోనా పాజిటివ్
ఏపీలో కరోనావైరస్ వ్యాప్తి కనిష్ఠస్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 7,969 శాంపిళ్లను పరీక్షించగా 71 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 22, గుంటూరు జిల్లాలో 16 కేసులు వెల్లడయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
ఏపీలో కరోనావైరస్ వ్యాప్తి కనిష్ఠస్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 7,969 శాంపిళ్లను పరీక్షించగా 71 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 22, గుంటూరు జిల్లాలో 16 కేసులు వెల్లడయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. ఇలా కొత్త కేసులు నమోదు కాని జిల్లాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అదే సమయంలో 595 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,17,812 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,00,760 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,325 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,727కి పెరిగింది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)