COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా నమోదైన కోవిడ్ కేసులు, ఒక్కరోజులోనే 17,354 మందికి పాజిటివ్, 64 మంది మృతి, 1 లక్షా 23 వేలకు చేరువలో ఆక్టివ్ కేసులు, 8 వేలకు చేరువగా కోవిడ్ మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 86,494 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 17,354 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఏపి ఒకరోజులో నమోదు చేసిన కోవిడ్ కేసుల్లో ఇదే అత్యధికం....

Coronavirus Outbreak Representational Image| (Photo Credits: PTI)

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 86,494 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 17,354 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఏపి ఒకరోజులో నమోదు చేసిన కోవిడ్ కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 11,01,690కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 10,98,795గా ఉంది. నిన్న 64 మంది కోవిడ్19తో మృతి చెందారు, దీంతో ఏపిలో కోవిడ్19 మృతుల సంఖ్య 7,992కు పెరిగింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement