COVID in AP: ఏపీలో కొత్తగా 1,891 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 440 కొత్త కేసులు

ఏపీలో గడచిన 24 గంటల్లో 26,236 శాంపిల్స్ పరీక్షించగా... 1,891 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 440 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 356, గుంటూరు జిల్లాలో 222, పశ్చిమ గోదావరి జిల్లాలో 186, ప్రకాశం జిల్లాలో 141, విశాఖ జిల్లాలో 121 కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 26,236 శాంపిల్స్ పరీక్షించగా... 1,891 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 440 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 356, గుంటూరు జిల్లాలో 222, పశ్చిమ గోదావరి జిల్లాలో 186, ప్రకాశం జిల్లాలో 141, విశాఖ జిల్లాలో 121 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 10,241 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,06,943 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,38,226 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 54,040 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,677కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement