Corona in AP: ఏపీలో కొత్తగా 27 మందికి కరోనా, అనంతపురం జిల్లాలో 11 కొత్త కేసులు

ఏపీలో గడచిన 24 గంటల్లో 8,948 కరోనా పరీక్షలు నిర్వహించగా, 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 11 కొత్త కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Representative image

ఏపీలో గడచిన 24 గంటల్లో 8,948 కరోనా పరీక్షలు నిర్వహించగా, 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 11 కొత్త కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 55 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,475 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,378 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇంకా 367 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement