Corona in AP: ఏపీలో కొత్తగా 31 మందికి కరోనా, అనంత‌పురం జిల్లాలో అత్య‌ధికంగా 11 కేసులు న‌మోదు

ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ కాసేప‌టి క్రితం విడుదలైంది. 10,372 కరోనా పరీక్షలు నిర్వహించగా, 31 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంత‌పురం జిల్లాలో అత్య‌ధికంగా 11 కేసులు న‌మోదు కాగా.. తూర్పు గోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 4 కొత్త కేసులు నమోదయ్యాయి.

Coronavirus test (Photo-ANI)

ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ కాసేప‌టి క్రితం విడుదలైంది. 10,372 కరోనా పరీక్షలు నిర్వహించగా, 31 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంత‌పురం జిల్లాలో అత్య‌ధికంగా 11 కేసులు న‌మోదు కాగా.. తూర్పు గోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. క‌ర్నూలు, ప్ర‌కాశం, ప‌శ్చిమ గోదావ‌రి, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 66 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,328 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,148 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 450 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement