Andhra Pradesh Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఇన్నోవా కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, పలువురికి గాయాలు
పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉద్యోగి సోమసి బాలగంగాధర్ శర్మ(78), ఆయన సతీమణి యశోద(67), డ్రైవర్ మృతి చెందారు. దారుణం, జామకాయలు తెంపుతున్నాడని దళిత మైనర్ను కాళ్లు, చేతులు కట్టేసి కొట్టిన యజమాని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
బాలగంగాధర్ శర్మ కుమారుడు హెచ్ఎస్వై శర్మ, ఆయన భార్య నాగసంధ్య, వీరి పిల్లలు కార్తిక్, అనుపమ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శర్మ, అనుపమ పరిస్థితి విషమంగా ఉందని పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Here's Videos