Tirumala: తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం.. మొదటి ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడగా నలుగురు భక్తులకు గాయాలు అయ్యాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడగా నలుగురు భక్తులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అలాగే తిరుమలలోని రాంభగీచా బస్టాండ్ సమీపంలో కొందరు భక్తులు ఎగ్ బిర్యానీ భోజనం చేస్తున్న సమయంలో విజిలెన్స్ అధికారులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన భక్తులు తిరుపతి నుంచి భోజనం తిరుమలకు తెచ్చుకుని తింటున్న సమయంలో కోడి గుడ్లు గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు ప్రాంతానికి చెందిన భక్తులు 30 మంది బృందంతో శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు. వీడియో ఇదిగో, తిరుమలలో ఎగ్ బిర్యానీ తింటూ ప్రత్యక్షమైన తమిళనాడు భక్తులు, వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీస్ సిబ్బంది
Another road accident in Tirumala