Rats In Hospital Ward: హాస్పిటల్ పిల్లల వార్డులో రోగి బెడ్ వద్ద ఎలుకల స్వైర విహారం.. మధ్య ప్రదేశ్ లో ఘటన (వీడియో)
ఆస్పత్రులు అంటేనే పరిశుభ్రమైన వాతావరణాన్ని కలిగి ఉండాలి. అయితే, మధ్య ప్రదేశ్ లోని మాండ్లా జిల్లా ఆసుపత్రిలో పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.
Hyderabad, Mar 9: ఆస్పత్రులు (Hospital) అంటేనే పరిశుభ్రమైన వాతావరణాన్ని కలిగి ఉండాలి. అయితే, మధ్య ప్రదేశ్ లోని మాండ్లా జిల్లా ఆసుపత్రిలో పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆస్పత్రిలోని పిల్లల వార్డులో రోగి బెడ్ వద్ద అనేక సంఖ్యలో ఎలుకలు (Rats) విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. రోగి తల దగ్గర కుప్పలు కుప్పలుగా ఎలుకలు కనిపించాయి. దీనికి సంబంధించి ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో రాష్ట్రంలోని ఆస్పత్రుల పరిస్థితులపై ప్రజలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆస్పత్రి యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతున్నదని ఆరోపిస్తున్నారు.
బిర్యానీలో బొద్దింక.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన (వీడియో)
Here's Video:
మధ్యప్రదేశ్ - మాండ్లా జిల్లా ఆసుపత్రిలో ఎలుకల సైర్యవిహారం
రోగి తల దగ్గర కుప్పలు కుప్పలుగా కనిపించిన ఎలుకలు pic.twitter.com/bYB7oOoKw5
— Telugu Scribe (@TeluguScribe) March 9, 2025
ఇక్కడ కూడా..
తెలంగాణలోని హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఇటీవల ఎలుకల బెడద తీవ్రమవుతోంది. ఏ వార్డులో చూసినా మూషికాలు స్వైరవిహారం చేస్తుండటంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2022 మార్చిలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు కొరుకగా... తీవ్ర రక్తస్రావం జరిగి అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
(The above story first appeared on LatestLY on Mar 09, 2025 08:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

