AP Assembly Session 2023: బాలకృష్ణకు మెంటల్ ఉంది కాల్పులు జరుపుతాడేమో, అసెంబ్లీలోకి రానివ్వకండి అధ్యక్షా, వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..

అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజైన శుక్రవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజిల్స్ వేయడంపై వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒకరోజు మీసాలు మెలేయడం మరుసటి రోజు విజిల్స్ వేయడం బాలయ్యకే చెల్లిందన్నారు.

Biyyapu MadhuSudhan Reddy (Photo-Video Grab)

అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజైన శుక్రవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజిల్స్ వేయడంపై వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒకరోజు మీసాలు మెలేయడం మరుసటి రోజు విజిల్స్ వేయడం బాలయ్యకే చెల్లిందన్నారు. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ ప్రవర్తనపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని...ఆయనను ఆస్పత్రికి తరలిస్తే మంచిదని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ సినిమా డైలాగులను మధుసూదన్ రెడ్డి సభలో వినిపించారు. ఫ్లూటు జింక ముందు ఊదు..జింక లాంటి మీ బావ చంద్రబాబు ముందు ఫ్లూట్‌ ఊదుకోవాలి..సింహం లాంటి సీఎం వైఎస్‌ జగన్‌ రెడ్డి ముందు ఊదకండి అంటూ మధుసూదన్ రెడ్డి సూచించారు. చంద్రబాబు సైకో..ఆయన తమ్ముడికి మెంటల్‌ ఉందని, బాలకృష్ణకు మెంటల్‌ సర్టిఫికెట్‌ ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి బాలకృష్ణ సభలో కాల్పులు జరిపే అవకాశం ఉందని.. ఆయనను బయటకు పంపించాలని సూచించారు. అంతేకాదు టీడీపీ సభ్యులను మానసిక ఆసుపత్రికి తరలించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. వీడియో ఇదిగో..

Biyyapu MadhuSudhan Reddy (Photo-Video Grab)

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement