MLC Parvartha Reddy Car Accident: ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి కారుకు ప్రమాదం.. ఎమ్మెల్సీ తలకు గాయాలు.. అక్కడికక్కడే మృతిచెందిన పీఏ.. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం (వీడియో)

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. గురువారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్‌ లో ఆయనకు గాయాలయ్యాయి.

MLC Parvartha Reddy (Credits: X)

Vijayawada, Jan 5: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (MLC) పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి (Parvartha Reddy Chandrashekhar Reddy) ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి (Road Accident) గురయ్యింది. గురువారం అర్ధరాత్రి  నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్‌ లో ఆయనకు గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ పీఏ ఘటనాస్థలంలోనే మృతిచెందారు.

ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉండగా గాయపడినవారిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి హుటాహుటిన తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కారు ముందు వెళుతున్న లారీ టైరు పంక్చరు కావడంతో ఒక్కసారిగా నెమ్మదించిందని, దీంతో లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. లారీని ఢీకొని డివైడర్‌పై పడిపోయిందని వివరించారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.

MLC Bye-Election in Telangana: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 29న పోలింగ్, అదే రోజు ఫలితాలు, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now