AP Coronavirus: ఏపీలో తాజాగా 993 మందికి కరోనా, నాలుగు జిల్లాల్లోనే అధికం, ముగ్గురు మృతితో 7,213కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, రాష్ట్రంలో 6,614 యాక్టివ్ కేసులు
ఏపీలో గత 24 గంటల్లో 30,851 మందికి టెస్టులు నిర్వహించగా 993 మందికి పాజిటివ్ గా నిర్ధారణ (AP Coronavirus) అయింది. గుంటూరు జిల్లాలో 198 కేసులు, చిత్తూరు జిల్లాలో 179, కృష్ణా జిల్లాలో 176, విశాఖపట్నం జిల్లాలో 169 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 12 కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల్లో గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి (Covid Deaths) చెందారు. ఇదే సమయంలో 480 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా గణాంకాలతో కలిపి కరోనా వల్ల ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,213కి చేరుకుంది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 9 లక్షలను దాటింది. మొత్తం 9,00,805 మంది కరోనా బారిన పడగా... 8,86,978 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,614 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. మాస్క్ ధరించని వారికి భారీ జరిమానాలు విధిస్తోంది.
Here's AP Covid Report:
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement