APPSC Group-1 Prelims: ఏపీలో నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్.. రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు.. ఎగ్జామ్ రాయనున్న 1,48,881 మంది అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ లో నేడు (ఆదివారం) నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్)కు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
Vijayawada, Mar 17: ఆంధ్రప్రదేశ్ లో నేడు (ఆదివారం) నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 (APPSC Group-1 Prelims) స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్)కు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు (Exam Centers) నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని చెప్పారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించామని వెల్లడించారు.