Asaduddin Owaisi Slams Chandrababu: టీటీడీలో ఉద్యోగుల తొలగింపుపై ఓవైసీ..చంద్రబాబు పునరాలోచించాలని డిమాండ్, వక్ఫ్బోర్డులో నాన్ ముస్లింలను తొలగించాలని డిమాండ్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి 18 నాన్-హిందూ ఉద్యోగులను తొలగించిన విషయంపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి 18 నాన్-హిందూ ఉద్యోగులను తొలగించిన విషయంపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు(Asaduddin Owaisi slams Chandrababu).
టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu) ఈ విషయంపై ఆలోచించాలన్నారు. వారి పార్టీ, జాయింట్ వర్కింగ్ కమిటీలో, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మరియు కేంద్ర వక్ఫ్ బోర్డులో కనీసం 2 నాన్-ముస్లిం సభ్యులను నియమించే బిల్లును బీజేపీకి మద్దతు ఇచ్చిందన్నారు.
అయితే, టీటీడీలో ఒక నాన్-హిందువు బోర్డు సభ్యుడు, ట్రస్టీ లేదా ఉద్యోగి కావడం సాధ్యం కాదు. ఇక్కడ కూడా అదే నియమం అనుసరించాలి. చంద్రబాబు నాయుడు బీజేపీని(BJP) ఎందుకు మద్దతు ఇస్తున్నారు? టీటీడీలో నాన్-హిందువు ఉండటం తప్పు అయితే, వక్ఫ్ బోర్డులో నాన్-ముస్లింలు ఉండటం తప్పు కాదా?" అని ఓవైసీ ప్రశ్నించారు.
Asaduddin Owaisi slams Chandrababu on removing on Non Hindu Employees at TTD