Covid in AP : ఏపీలో కరోనా కల్లోలం, తాజాగా 1,005 మందికి కోవిడ్ పాజిటివ్, ప్రస్తుతం 5,394 యాక్టివ్ కేసులు, ఇద్దరు మరణంతో 7,205కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య

ఏపీలో కొత్త కేసుల సంఖ్య తాజాగా 1000 దాటింది. గడచిన 24 గంటల్లో 31,142 కరోనా పరీక్షలు చేయగా 1,005 మందికి పాజిటివ్ (Covid in AP) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 225 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 184, విశాఖ జిల్లాలో 167, కృష్ణా జిల్లాలో 135 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 324 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. 

Coronavirus (Photo Credits: IANS)

రాష్ట్రంలో ఇప్పటివరకు 8,98,815 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,86,216 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. కొత్త కేసులకు తగ్గట్టుగానే యాక్టివ్ కేసుల సంఖ్య కూడా మరింత పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 5,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 7,205కి (Coronavirus Death Toll) చేరింది.

ArogyaAndhra Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement