Andhra Pradesh: కాకినాడ జిల్లా తునిలో దొంగలు బీభత్సం.. షాపుల షట్టర్లు పగుల కొట్టి చోరీకి పాల్పడిన వైనం, భయాందోళనలో స్థానికులు, వీడియో ఇదిగో
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తునిలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్థరాత్రి సమయంలో పలు షాపుల షట్టర్లు పగుల కొట్టి చోరీ కి పాల్పడ్డారు. ఏకంగా పది షాపుల్లో క్యాష్ కౌంటర్ లో నగదు దోచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని(Andhra Pradesh) కాకినాడ జిల్లా తునిలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్థరాత్రి సమయంలో పలు షాపుల షట్టర్లు పగుల కొట్టి చోరీ కి పాల్పడ్డారు. ఏకంగా పది షాపుల్లో క్యాష్ కౌంటర్ లో నగదు దోచుకున్నారు(Thieves Create Havoc in Tuni).
షాపుల్లో లాప్ ట్యాప్, మొబైల్స్ జోలికి పోకుండా నగదు ను మాత్రమే తీసుకువెళ్ళారు. ఒక షాప్ లో సీసీ కెమెరా లో దొంగల దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని షాపులను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఏపీలో డీఐజీ వికృత చేష్టలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తాను వేరే మహిళతో ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు వీడియోలు భార్యకు పంపి భర్త వేధిస్తున్నారు. వివరాల ప్రకారం...బాధితురాలు భార్య అనుసూయా రాణి గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త కిరణ్ నెల్లురు జిల్లాలో డిఐజీగా విధులు నిర్వహిస్తున్నారు.
Thieves Create Havoc in Tuni, Kakinada District