Vijayawada Bus Accident: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌ లో ప్రయాణికులపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు (వీడియోతో)

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. బ్రేక్‌ ఫెయిలవ్వడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్లాట్‌ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

Vijayawada Bus Accident (Credits: X)

Vijayawada, Nov 6: విజయవాడ (Vijayawada) ఆర్టీసీ బస్టాండ్‌ (RTC Bus Stand) లో ఘోర ప్రమాదం జరిగింది. బ్రేక్‌ ఫెయిలవ్వడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్లాట్‌  ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. 12వ నంబర్‌ ప్లాట్‌ ఫాం వద్ద నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో కండక్టర్‌ తోపాటు ఓ మహిళ, 10 నెలల చిన్నారి మృతి చెందారు. బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఆటోనగర్‌ డిపోకు చెందిన బస్సు.. గుంటూరు వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతిచెందిన కండక్టర్‌ ను గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.

Rajasthan Accident: రాజస్థాన్‌ లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం.. వంతెనపై నుంచి రైలు పట్టాలపై పడ్డ బస్సు.. నలుగురు మృతి.. 30 మందికి గాయాలు.. ప్రమాద సమయంలో బస్సులో 34-38 మంది ప్రయాణికులు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement