Vijayawada Bus Accident: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ప్రయాణికులపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు (వీడియోతో)
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిలవ్వడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
Vijayawada, Nov 6: విజయవాడ (Vijayawada) ఆర్టీసీ బస్టాండ్ (RTC Bus Stand) లో ఘోర ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిలవ్వడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. 12వ నంబర్ ప్లాట్ ఫాం వద్ద నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో కండక్టర్ తోపాటు ఓ మహిళ, 10 నెలల చిన్నారి మృతి చెందారు. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు.. గుంటూరు వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతిచెందిన కండక్టర్ ను గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement