Mekapati Goutham Reddy Death Anniversary: ఐ మిస్ యూ గౌతమ్ అంటూ వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్, నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం
దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం ఉంచారు
దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం ఉంచారు. నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) మూడో వర్ధంతి సందర్భంగా.. నేను ఆయన్ని మనసారా గుర్తు చేసుకుంటున్నా. ఐ మిస్ యూ గౌతమ్ అంటూ ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారు.
గుండెపోటుతో మేకపాటి గౌతమ్రెడ్డి కన్నుమూత, ఇటీవలే కోవిడ్ బారిన పడి కోలుకున్న ఏపీ ఐటీశాఖ మంత్రి
ఆత్మకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీ ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (49) 2022 ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్(Hyderabad) లోని తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. వైద్యులు తీవ్రంగా శ్రమించినా.. ఫలితం లేకపోయింది. గౌతమ్ రెడ్డి మరణంతో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడైన గౌతమ్ రెడ్డి.. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఆయన విజయం సాధించారు.
Jagan Tweet on Mekapati Goutham Reddy Death Anniversary
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)