Bandi Sanjay: LRS పేరుతో రూ.50వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్.. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని బండి సంజయ్ ఫైర్
ఎల్ ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. పెద్దపల్లి మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎల్ ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay). పెద్దపల్లి మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్(LRS Scheme) చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు.
ఇదిగో ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ఇదే.. బర్త్, డెత్ రెగ్యులరైజేషన్ స్కీంలను కూడా ప్రవేశపెడతారేమోనన్నారు. కేంద్ర బడ్జెట్ పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాలని సవాల్ విసిరారు.
మీకు చేతనైతే బీసీ రిజర్వేషన్లపై టెన్ జనపథ్ ఎదుట ధర్నా చేయండన్నారు. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి.. ఉచితంగా ఎల్ ఆర్ఎస్ చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ వీడియో విడుదల చేశారు సంజయ్.
Bandi Sanjay angry on CM Revanth Reddy about LRS Scheme