BJP MP Etela Rajender: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై కేసు నమోదు, సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్ దాడి చేశారంటూ ఫిర్యాదు
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై పోలీస్ కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై పోలీస్ కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు. 126(2), 115(2), 352,351(2), r/w 189(2), r/w 191(2) BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఏకశిలా నగర్లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్తో పాటు 30 మంది దాడి చేశారంటూ ఫిర్యాదు నేపథ్యంలో కేసు ఫైల్ అయింది.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారంలోని ఏకశిలానగర్లో పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే. తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బాధితులు, రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారన్న విషయాన్ని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. వీడియో ఇదిగో, రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఎందుకంటే..
Police Case Filed Against BJP MP Etela Rajender
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కేసు నమోదు