Case Registered On Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావుపై మరో కేసు.. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు
బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పై మరో కేసు నమోదు అయింది. హరీశ్ రావుతో పాటు మరో ముగ్గురి నుంచి తనకి ప్రాణాపాయం ఉందని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish rao) పై మరో కేసు నమోదు అయింది. హరీశ్ రావుతో పాటు మరో ముగ్గురి నుంచి తనకి ప్రాణాపాయం ఉందని చక్రధర్ గౌడ్(Chakradhar Goud) అనే వ్యక్తి బాచుపల్లి పోలీసులకు (Bachupally Police Station) ఫిర్యాదు చేశాడు.
చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు హరీశ్రావుపై 351(2), ఆర్డబ్ల్యూ 3(5) పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్తో పాటు సంతోష్కుమార్, రాములు, వంశీలపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో ఎ-2గా హరీశ్ పేరును పోలీసులు చేర్చారు.
గతంలో కూడా చక్రధర్ గౌడ్.. హరీశ్ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హరీశ్ రావుతో పాటు అప్పటి టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 120(vr),386,409,రెడ్విత్ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో హరీశ్ రావుకు ముందస్తు బెయిల్ లభించింది.