ED Case on Falcon Scam: ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు.. రూ.1700 కోట్ల స్కాం, హైదరాబాద్‌లోనే రూ.850 కోట్లు వసూలు చేసిన సంస్థ, విదేశాల్లో నిందితులు!

సంచలనం రేపిన ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు అయింది . హైదరాబాద్ కేంద్రంగా వెలుగు లోకి వచ్చిన ఫాల్కన్ స్కాంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. రూ.1700 కోట్లు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టింది ఫాల్కన్ సంస్థ.

ED Registers Case on Falcon Scam Collected ₹1,700 Crore to Investors(X)

సంచలనం రేపిన ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు అయింది(ED Case on Falcon Scam). హైదరాబాద్ కేంద్రంగా వెలుగు లోకి వచ్చిన ఫాల్కన్ స్కాంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. రూ.1700 కోట్లు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టింది ఫాల్కన్ సంస్థ.

ఒక్క హైదరాబాదులోనే రూ.850 కోట్లు వసూలు చేసింది ఫాల్కన్ సంస్థ(Falcon Scam). పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన డబ్బును విదేశాలకు మళ్లించినట్లు గుర్తించింది ఈడీ.తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ప్రచారం చేసింది ఫాల్కన్.

ఇది కాలం తెచ్చిన కరువు కాదు...కాంగ్రెస్ తెచ్చిన కరువు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

22 షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు నగదు మళ్ళించినట్లు గుర్తించారు. దుబాయ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు డబ్బును పంపించినట్లు గుర్తించారు. కేసు నమోదు కాగానే చార్టెడ్ ఫ్లైట్ లో దుబాయ్ కి పారిపోయారు చైర్మన్ అమర్ దీప్ కుమార్. విదేశాలకు పారిపోయిన నిందితుల కోసం LOC జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement