MP Kiran Kumar Reddy: బీజేపీ ఎంపీ డీకే అరుణకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, రేషన్ కార్డులలో మోదీ పోటో పెట్టాలంటే ఆ పని చేయాలని డిమాండ్
బీజేపీ ఎంపీ డీకే అరుణకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు . రేషన్ కార్డులలో మోదీ ఫోటో పెట్టాలంటే ప్రస్తుతం ఉన్న 90 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇవ్వాలన్నారు.
బీజేపీ ఎంపీ డీకే అరుణకు(DK Aruna) ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు(MP Kiran Kumar Reddy). రేషన్ కార్డులలో మోదీ(Modi Photo) ఫోటో పెట్టాలంటే ప్రస్తుతం ఉన్న 90 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇవ్వాలన్నారు.
ఈ మేరకు వీడియో రిలీజ్ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం తెలంగాణలో 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు(Telangana Ration Cards) ఉంటే.. 54 లక్షల కార్డులకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం అన్నారు.
మిగతా 34 లక్షల రేషన్ కార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 54 లక్షల కార్డులకు ఒక కేజీ చొప్పున అదనపు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందన్నారు. ప్రతి నెల దీనిపై రూ.352 కోట్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.
MP Chamala Kiran Kumar Reddy Counter to DK Aruna
డీకే అరుణకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్..