Pune Road Accident: పూణే శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతి, అజ్‌మేర్‌ దర్గా సందర్శనకు వెళ్ళి వస్తుండగా ఘటన

మహారాష్ట్రలోని పూణే శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు యువకులు అజ్‌మేర్‌ దర్గా సందర్శనకు వెళ్లారు.

Pune Road Accident

మహారాష్ట్రలోని పూణే శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు యువకులు అజ్‌మేర్‌ దర్గా సందర్శనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పుణె శివారులోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, ఖురేషి, రఫిక్‌, ఫిరోజ్‌ కురేషి, మజీద్‌ పటేల్‌ ఘటనా స్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్‌ అమర్‌ను పుణె ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు. షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకుల ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్న

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement