ACB Raid in Hyd: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్‌ జ్యోతి లంచం కేసు, రూ.65 లక్షల నగదు, మూడున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, అనంతరం అరెస్ట్

ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, మూడున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

ACB Seizes Rs 65.5 Lakh Cash, 3.6 kg Gold in Raid on Tribal Welfare Officer’s House After She Was Caught Red-Handed Accepting Bribe

గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఎస్‌ఈ) కె.జగజ్యోతి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిన సంగతి విదితమే. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిజామాబాద్‌ పట్టణంలో ఒక నిర్మాణ పనిని, గాజుల రామారంలో జువెనైల్‌ బాయిస్‌ హాస్టల్‌ నిర్మాణపనులను బొడుకం గంగన్న అనే లైసెన్స్‌డ్‌ కాంట్రాక్టర్‌ చేపట్టారు.

వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయమై కాంట్రాక్టర్‌ను ఆ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ కె.జగజ్యోతి లంచం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్‌ నుంచి రూ.84 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, మూడున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.  ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక లంచాలకు అలవాటు, రూ. 84 వేలు తీసుకుంటూ అడ్డంగా ఏసీబీ అధికారులకు దొరికిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement