Telangana: వీడియో ఇదిగో, భార్య కాపురానికి రావడం లేదని టవర్ ఎక్కిన భర్త , అక్కడి నుంచి దూకి చచ్చిపోతానని బెదిరింపులు, చివరకి ఏమైందంటే..

జగిత్యాల - ఎండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన మేకల ప్రభాకర్ వృత్తి రీత్యా పెయింటర్. భార్య కాపురానికి రావడం లేదని హెవీ విద్యుత్ లైన్ పోల్ ఎక్కి నిరసన తెలిపాడు. నా భార్య రాకుంటే అక్కడి నుంచి దూకి చచ్చిపోతానని బెదిరించాడు.

husband climbed tower because his wife was not coming to His Home

జగిత్యాల - ఎండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన మేకల ప్రభాకర్ వృత్తి రీత్యా పెయింటర్. భార్య కాపురానికి రావడం లేదని హెవీ విద్యుత్ లైన్ పోల్ ఎక్కి నిరసన తెలిపాడు. నా భార్య రాకుంటే అక్కడి నుంచి దూకి చచ్చిపోతానని బెదిరించాడు.ధర్మపురి పోలీసులు జోక్యం చేసుకొని భార్యను పిలిపించి మాట్లాడుతామని హమీ ఇవ్వగా శాంతించిన భర్త టవర్ పై నుంచి దిగిరాగా ఇద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగా వివాదం సర్దుమనింది వీడియో ఇదిగో..

మేకల ప్రభాకర్ లావణ్య దంపతుల మధ్య నెలకొన్న కుటుంబ కలహాల నేపద్యంలో కొంత కాలంగా భర్తకు దూరంగా భార్య తల్లిగారి ఇంటి వద్దనే పిల్లలతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించిన తనకు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ ప్రభాకర్ విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ క్రమంలో ధర్మపురి సీఐ రమణమూర్తి జోక్యం చేసుకొని ప్రభాకర్ భార్యను ఇక్కడికి రప్పిస్తామని చెప్పి హామీ ఇవ్వటంతో అతను శాంతించి టవర్ పై నుంచి కిందకు దిగాడు. అనంతరం భార్య భర్త లిద్దరినీ పోలీస్ స్టేషన్ కు పిలిపించుకొని పెద్దమనుషుల సమక్షంలో సీఐ రమణ మూర్తి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో భార్యాభర్తల వివాదం సద్దుమనిగింది.

husband climbed tower because his wife was not coming to His Home

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement