![](https://test1.latestly.com/uploads/images/2024/10/52-88.jpg?width=380&height=214)
Newdelhi, Oct 21: ఐరోపాలోని ఫ్రాన్స్ (France) లో ఉన్న ఈఫిల్ టవర్ చూశారా? ఇనుముతో చేసిన ఈ ఎత్తైన కట్టడాన్ని చూడటానికి ఏటా కోట్లాది మంది పర్యాటకులు క్యూ కడతారు. ఆ ఈఫిల్ టవర్ స్ఫూర్తితో దాన్ని పోలిన మరో నిర్మాణాన్ని మన దేశంలోనూ చేపట్టారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వెదురు టవర్ (World’s Tallest Bamboo Tower) ను ఛత్తీస్ గఢ్ లో నిర్మించారు మరి. ఈ నిర్మాణం రాయ్ పూర్ కు 70 కిలోమీటర్ల దూరంలోని కతియా గ్రామంలో ఉంది. పర్యాటక ఆకర్షణగా నిలిచిన ఈ టవర్ ను కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ టవర్ ను వాచ్ టవర్, టెలికామ్ టవర్, ప్రసార టవర్, రేడియో టవర్ గా ఉపయోగించుకొనేందుకు తగిన సామర్థ్యం కలిగి ఉందని నిర్మాణ సంస్థ చెప్పింది.
Union Minister for Road Transport and Highways #NitinGadkari inaugurated the tallest bamboo tower built at a cost of Rs 11 lakh in Chhattisgarh's Kathiya village.https://t.co/GUMxD1CH6I
— The New Indian Express (@NewIndianXpress) October 20, 2024
--టవర్ విశేషాలు ఇవిగో..--
- వ్యయం-రూ.11 లక్షలు
- ఎత్తు-140 అడుగులు
- ఉపయోగించిన వెదురు-7400 కిలోలు
- నిర్మాణ సంస్థ-భవ్య సృష్టి అనే స్టార్టప్
- టవర్ జీవిత కాలం-25 ఏండ్లు