Covid in TS: తెలంగాణలో కొత్తగా 2,982 మందికి కరోనా, 21 మంది మృత్యువాత, జీహెచ్‌ఎంసీ పరిధిలో 436 కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 36,917 యాక్టివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 2,982 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,74,026కి చేరింది. తాజాగా ఈ మహమ్మారి కారణంగా 21 మంది మృత్యువాత పడగా.. మృతుల సంఖ్య 3,247కి చేరినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Coronavirus in US (Photo Credits: PTI)

తెలంగాణలో కొత్తగా 2,982 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,74,026కి చేరింది. తాజాగా ఈ మహమ్మారి కారణంగా 21 మంది మృత్యువాత పడగా.. మృతుల సంఖ్య 3,247కి చేరినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. 1,00,677 పరీక్షలు చేసినట్లు పేర్కొంది. 36,917 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 436 కేసులు వెలుగుచూశాయి.

మరోవైపు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. తాజాగా 3,837 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. దేశంలో 90.8 శాతం రికవరీ రేటు ఉండగా... రాష్ట్రంలో ఈ రేటు 93 శాతంగా ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు సైతం జాతీయ సగటు (1.2శాతం)తో పోలిస్తే రాష్ట్రం మిన్నగా ఉందని (0.56శాతం) పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Champions Trophy 2025, AUS Vs ENG: ఛేజింగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా, 351 టార్గెట్‌ను మరో 15 బాల్స్‌ మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో చేధించిన కంగారులు

SLBC Tunnel Collapse: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్, ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై వివరాలు అడిగిన ప్రధాని, కేంద్రం తరుపున సాయం చేస్తామని హామీ

SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు, కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్మికుల వివరాలివే

Bandi Sanjay: ఎవడైనా హిందీ పేపర్ లీక్ చేస్తాడా..?..గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసుతో నా ఇజ్జత్ పోయిందన్న కేంద్రమంత్రి బండి సంజయ్, వైరల్‌గా మారిన వీడియో

Share Now