Covid in TS: తెలంగాణలో కొత్తగా 2,982 మందికి కరోనా, 21 మంది మృత్యువాత, జీహెచ్‌ఎంసీ పరిధిలో 436 కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 36,917 యాక్టివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 2,982 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,74,026కి చేరింది. తాజాగా ఈ మహమ్మారి కారణంగా 21 మంది మృత్యువాత పడగా.. మృతుల సంఖ్య 3,247కి చేరినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Coronavirus in US (Photo Credits: PTI)

తెలంగాణలో కొత్తగా 2,982 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,74,026కి చేరింది. తాజాగా ఈ మహమ్మారి కారణంగా 21 మంది మృత్యువాత పడగా.. మృతుల సంఖ్య 3,247కి చేరినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. 1,00,677 పరీక్షలు చేసినట్లు పేర్కొంది. 36,917 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 436 కేసులు వెలుగుచూశాయి.

మరోవైపు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. తాజాగా 3,837 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. దేశంలో 90.8 శాతం రికవరీ రేటు ఉండగా... రాష్ట్రంలో ఈ రేటు 93 శాతంగా ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు సైతం జాతీయ సగటు (1.2శాతం)తో పోలిస్తే రాష్ట్రం మిన్నగా ఉందని (0.56శాతం) పేర్కొంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement