Corona in TS: తెలంగాణలో కొత్తగా 449 మందికి కరోనా, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు, ఇద్దరు మృతితో 3,825కి చేరుకున్న మరణాల సంఖ్య, రాష్ట్రంలో ప్రస్తుతం 8,406 యాక్టివ్ కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 79,231 కరోనా పరీక్షలు నిర్వహించగా, 449 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 52, వరంగల్ అర్బన్ జిల్లాలో 45 కేసులు గుర్తించారు.

Coronavirus Outbreak (Photo credits: IANS)

తెలంగాణలో గత 24 గంటల్లో 79,231 కరోనా పరీక్షలు నిర్వహించగా, 449 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 52, వరంగల్ అర్బన్ జిల్లాలో 45 కేసులు గుర్తించారు. ఇక, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 623 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,49,406 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,37,175 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 8,406 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 3,825కి చేరింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement