KTR on CM Revanth Reddy: ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ, సెటైర్ వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కంప్యూటర్లను కనిపెట్టడం, మళ్లీ వాటిని ఆవిష్కరించడంలో సీఎం బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. దీంతో పాటు ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో నిమగ్నమై ఉన్నారని కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కంప్యూటర్లను కనిపెట్టడం, మళ్లీ వాటిని ఆవిష్కరించడంలో సీఎం బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. దీంతో పాటు ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో నిమగ్నమై ఉన్నారని కేటీఆర్ విమర్శించారు.
అయితే సీఎం తన విధులను విస్మరిస్తున్నారని ఈ పాలమూరు బిడ్డకు ఎవరైనా ఒక్కరు గుర్తు చేయాలన్నారు.తెలంగాణకు ముఖ్యమైన, రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులను ఎందుకు ధ్వంసం చేస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.ఇటీవల సంభవించిన వరదలకు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులోని వట్టెం పంపు హౌస్ నీట మునిగినప్పటికీ సీఎం రేవంత్ ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు.
Here's Tweet