Aditya-L1 Mission Update: మరో కీలక ఘట్టం భూమికి బైబై చెప్పి సూర్యుడి వైపు వెళుతున్న ఆదిత్య ఎల్‌-1, ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్య పెంపు మరోసారి సక్సెస్

ఆదిత్య ఎల్‌-1(Aditya L1) ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఇస్త్రో శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌-1(Trans-Lagrangian Point 1) దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇస్రో తాజాగా ఎక్స్‌(ట్విటర్‌లో) పోస్టు చేసింది.

Aditya L1 (Photo credits: Twitter/@isro)

ఆదిత్య ఎల్‌-1(Aditya L1) ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఇస్త్రో శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌-1(Trans-Lagrangian Point 1) దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇస్రో తాజాగా ఎక్స్‌(ట్విటర్‌లో) పోస్టు చేసింది. ప్రస్తుతం వాహక నౌక(Space Carft) లగ్రాంజ్‌(Langrnge) పాయింట్‌-1 దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహ భూకక్ష్యను నాలుగుసార్లు పెంచారు. తాజాగా ఐదోసారి కక్ష్యను పెంచి సూర్యుడి దిశలోని లంగ్రాజ్‌ పాయింట్‌-1 వైపు వెళ్లేలా విన్యాసం చేశారు. 110 రోజుల ప్రయాణం అనంతరం ఆదిత్య ఎల్‌-1ను మరొక విన్యాసంతో లగ్రాంజ్‌ పాయింట్‌-1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు.భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లగ్రాంజ్‌ పాయింట్‌-1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ సూర్యుడిపై పరిశోధనలు మొదలు పెడుతుంది.

Here's ISRO Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now