Chandrayaan-3 Mission: జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగన ఫోటోను క్లిక్మనిపించిన రోవర్ ప్రజ్ఞాన్, నాసా ట్వీట్ ఇదిగో..
ఇస్రో తాజాగా మరో అప్ డేట్ అందించింది. చంద్రుడి ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్(Vikram Lander) ఫోటోను రోవర్ ప్రజ్ఞాన్ తీసింది.ఈ రోజు ఉదయం తీసిన ఆ ఫోటోను ఇస్రో స్మైల్ ప్లీజ్ అంటూ తన ట్వీట్లో పోస్టు చేసింది. రోవర్ ప్రజ్ఞాన్(Pragyan Rover)కు ఉన్న నావిగేషన్ కెమెరా ఆ ఫోటోను క్లిక్ అనిపించింది
ఇస్రో తాజాగా మరో అప్ డేట్ అందించింది. చంద్రుడి ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్(Vikram Lander) ఫోటోను రోవర్ ప్రజ్ఞాన్ తీసింది.ఈ రోజు ఉదయం తీసిన ఆ ఫోటోను ఇస్రో స్మైల్ ప్లీజ్ అంటూ తన ట్వీట్లో పోస్టు చేసింది. రోవర్ ప్రజ్ఞాన్(Pragyan Rover)కు ఉన్న నావిగేషన్ కెమెరా ఆ ఫోటోను క్లిక్ అనిపించింది. కాగా చంద్రయాన్-3(Chandrayaan-3) మిషన్ కోసం లాబరేటరీ ఫర్ ఎలక్ట్రో-ఆప్టిక్స్-సిస్టమ్స్(ఎల్ఈఓఎస్) సంస్థ నావిగేషన్ కెమెరాలను రూపొందించిన విషయం తెలిసిందే.
ఎల్ఈఓఎస్ సంస్థ బెంగుళూరులోని పీన్యా పారిశ్రామిక ఎస్టేట్లో ఉంది. ఇక్కడే 1975లో ఇండియా తన తొలి శాటిలైట్ను రూపొందించింది. అంతరిక్ష ప్రయోగాల కోసం ఆ సంస్థ యూనిట్లో అటిట్యూడ్ సెన్సార్లను డిజైన్ చేస్తారు.కాగా చంద్రుడిపై సల్ఫర్తో పాటు ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు మంగళవారం రోవర్ గుర్తించిన విషయం తెలిసిందే.
Here's ISRO Tweet