Nepal Earthquake: నేపాల్‌ లో భూకంపం.. 128 మందికి పైగా మృతి.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత.. జార్కోట్ జిల్లాలోని లాబిదండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం.. ఉత్తర భారతంలోనూ స్వల్ప ప్రకంపనలు

నేపాల్‌ లో శుక్రవారం భూకంపం సంభవించింది. జార్కోట్ జిల్లాలో లాబిదండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ గుర్తించింది.

Nepal Earthquake (Credits: X)

Newdelhi, Nov 4: నేపాల్‌ (Nepal) లో శుక్రవారం భూకంపం (Earthquake) సంభవించింది. జార్కోట్ జిల్లాలో లాబిదండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ గుర్తించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత కలిగిన ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు, భవంతులు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటివరకూ 128కిపైగా మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభావిత ప్రాంతంలోని శిథిలాల కింద ఉన్న వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, భూకంప ప్రభావం ఢిల్లీతో పాటూ ఉత్తరాదిన పలు ప్రాంతాల్లోనూ కనిపించింది.

Probe on Balls: టీమిండియా బౌలర్లు ఉపయోగిస్తున్న బంతులపై అనుమనాలున్నాయ్.. పాక్ మాజీ బ్యాట్స్‌ మెన్ హసన్ రజా సంచలన డిమాండ్.. బంతులను తనిఖీ చేయాలని ఐసీసీకి సూచన.. ‘కామెడీ’గా అభివర్ణించిన మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement