IND vs SL 3rd ODI: మూడో వన్డేలో భారత్ ఓటమి, ఆల్ రౌండ్ షోతో మూడు వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక, మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఫెర్నాండో, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా సూర్యకుమార్‌, 2-1తో సీరిస్ భారత్ కైవసం

మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంకకు ఓదార్పు విజయం లభించింది. శుక్రవారం నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో (IND vs SL 3rd ODI) లంక మూడు వికెట్ల తేడాతో భారత్‌పై ( Sri Lanka Secure Consolation Victory) గెలిచింది. ఈ ఏడాది ఈ జట్టుకిది రెండో వన్డే విజయం కాగా సిరీస్‌ మాత్రం 2-1తో శిఖర్ ధవన్‌ సేన గెలుచుకుంది.

India wins (Photo-Twitter)

మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంకకు ఓదార్పు విజయం లభించింది. శుక్రవారం నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో (IND vs SL 3rd ODI) లంక మూడు వికెట్ల తేడాతో భారత్‌పై ( Sri Lanka Secure Consolation Victory) గెలిచింది. ఈ ఏడాది ఈ జట్టుకిది రెండో వన్డే విజయం కాగా సిరీస్‌ మాత్రం 2-1తో శిఖర్ ధవన్‌ సేన గెలుచుకుంది. ముందుగా భారత్‌ 43.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. పృథ్వీ షా (49), సంజూ శాంసన్‌ (46) బంతికో పరుగు చొప్పున బాదారు. దీంతో రెండో వికెట్‌కు 74 రన్స్‌ జత చేరాయి. ఓ దశలో 157/3తో పటిష్టంగానే కనిపించినా.. స్పిన్నర్లు అఖిల ధనంజయ (3/44), జయవిక్రమ (3/59) ధాటికి మిడిలార్డర్‌ దెబ్బతింది.

ఈ సమయంలో సూర్యకుమార్‌ (40) నిలకడ చూపాడు. ఛేదనలో లంక 39 ఓవర్లలో 7 వికెట్లకు 227 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో (76), రాజపక్స (65) రెండో వికెట్‌కు 109 పరుగుల భారీ భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేశారు. రాహుల్‌ చాహర్‌కు 3 వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఫెర్నాండో, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా సూర్యకుమార్‌ నిలిచారు. భారత్‌ నుంచి శాంసన్‌, రాహుల్‌ చాహర్‌, నితీశ్‌ రాణా, క్రిష్ణప్ప గౌతమ్‌, సకారియా వన్డే అరంగేట్రం చేశారు.

బ్యాట్లతో తలలు పగలకొట్టుకున్న క్రికెట్ ఆటగాళ్లు, పాకిస్తాన్‌లోని పేదల వైద్యం కోసం లండన్‌లో నిర్వహించిన ఛారిటీ మ్యాచ్‌లో విషాద ఘటన, ఇద్దరు ఆటగాళ్లకు తీవ్రగాయాలు

అనంతరం లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన లంక అవిష్క ఫెర్నాండో (76), రాజపక్స (65) రాణించడంతో లక్ష్యాన్ని (డ/లూ పద్ధతిలో 227) శ్రీలంక 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్‌ చాహర్‌ మూడు వికెట్లు చేజిక్కించుకోగా.. సకారియా రెండు వికెట్లు పడగొట్టాడు. భారత్‌, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆదివారం ఆరంభమవుతుంది.

దీపక్  బ్యాటింగ్ మ్యాజిక్, శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో నెగ్గి 2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్

స్కోరుబోర్డు: భారత్‌: పృథ్వీ షా (ఎల్బీ) షనక 49; ధవన్‌ (సి) భనుక (బి) చమీర 13; శాంసన్‌ (సి) ఫెర్నాండో (బి) జయవిక్రమ 46; మనీశ్‌ పాండే (సి) భనుక (బి) జయవిక్రమ 11; సూర్యకుమార్‌ (ఎల్బీ) అఖిల 40; హార్దిక్‌ (ఎల్బీ) జయవిక్రమ 19; నితీశ్‌ రాణా (సి) భనుక (బి) అఖిల 7; క్రిష్ణప్ప గౌతమ్‌ (ఎల్బీ) అఖిల 2; రాహుల్‌ చాహర్‌ (సి అండ్‌ బి) కరుణరత్నె 13; సైనీ (సి) అవిష్క (బి) చమీర 15; సకారియా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 43.1 ఓవర్లలో 225. వికెట్ల పతనం: 1-28, 2-102, 3-118, 4-157, 5-179, 6-190, 7-194, 8-195, 9-224, 10-225. బౌలింగ్‌: చమీర 8.1-0-55-2; అఖిల 10-0-44-3; కరుణరత్నె 6-0-25-1; జయవిక్రమ 10-0-59-3; షనక 8-0-33-1; మెండిస్‌ 1-0-8-0.

శ్రీలంక: ఫెర్నాండో (సి) పృథ్వీ షా (బి) రాహుల్‌ చాహర్‌ 76; భనుక (సి) సకారియా (బి) గౌతమ్‌ 7; రాజపక్స (సి) గౌతమ్‌ (బి) సకారియా 65; ధనంజయ డిసిల్వ (సి అండ్‌ బి) సకారియా 2; అసలంక (ఎల్బీ) హార్దిక్‌ 24; షనక (సి) మనీశ్‌ షాండే (బి) చాహర్‌ 0; మెండిస్‌ (నాటౌట్‌) 15; కరుణరత్నె (స్టంప్‌) శాంసన్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 3; అఖిల (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 30; మొత్తం: 39 ఓవర్లలో 227/7. వికెట్ల పతనం: 1-35, 2-144, 3-151, 4-194, 5-195, 6-214, 7-220. బౌలింగ్‌: సైనీ 5-0-27-0; సకారియా 8-0-34-2; రాహుల్‌ చాహర్‌ 10-0-54-3; గౌతమ్‌ 8-0-49-1; హార్దిక్‌ 5-0-43-1; రాణా 3-0-10-0.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement