Andhra Pradesh Horror: కోడలి తల నరికి ఆ తలను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన అత్త, అన్నమయ్య జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లాలో రాయచోటి కేంద్రంలోని కె రామాపురంలో కోడలి తలనరికి చంపిన అత్త (aunt who killed the daughter-in-law)... ఆ తర్వాత కోడలి తలను చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్కు ( took her head to the police Station) వెళ్లి లొంగిపోయింది.
Annamayya, August 11: ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లాలో రాయచోటి కేంద్రంలోని కె రామాపురంలో కోడలి తలనరికి చంపిన అత్త (aunt who killed the daughter-in-law)... ఆ తర్వాత కోడలి తలను చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్కు ( took her head to the police Station) వెళ్లి లొంగిపోయింది. అంతేకాకుండా తన కోడలిని తానే హత్య చేశానంటూ పోలీసుల ఎదుట నిర్భయంగా నేరాన్ని ఒప్పుకుంది.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళితే... జిల్లాలోని రాయచోటి మండలం కె.రామాపురంలో సుబ్బమ్మ నివసిస్తోంది. కోడలు వసుంధర (35)తో ఆమెకు గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఆవేశంతో ఊగిపోయిన సుబ్బమ్మ... కోడలు వసుంధరపై దాడికి దిగింది. కత్తి తీసుకుని వసుంధర తల నరికేసింది. ఆ వెంటనే, తెగి పడిన వసుంధర తలను చేత బట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లింది. తన కోడలిని తానే హత్య చేశానని పోలీసులకు చెప్పింది.
కోడలి తలతో సుబ్బమ్మ అలా నడుచుకుంటూ వెళుతుంటే... జనం బెంబేలెత్తిపోయారు. కుటుంబ కలహాలతో పాటు ఆస్తి గొడవలే ఈ హత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాయచోటి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)