CM YS Jagan Writes to CJI: ఏపీ సీఎం వైయస్ జగన్ లేఖలో ఏముంది? న్యాయవ్యవస్థపై చర్చ మరోసారి తెరపైకి, ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న పలువురు ప్రముఖులు, సీజేఐ ఎస్‌ఎ బాబ్డే ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పనితీరుపై, దానిని ప్రభావితం చేస్తున్న సుప్రీంకోర్డు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డేకు లేఖ (CM YS Jagan Writes to CJI) రాసిన సంగతి రాసారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి అండదండలతో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి (Telugu Desam Party (TDP) అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుల ప్రభావం ( files complaint against top SC judge and some judges) ఉందని ఈ లేఖలో సీఎం జగన్ ( CM YS Jagan Mohan Reddy) ఆరోపించారు.

CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, Oct 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పనితీరుపై, దానిని ప్రభావితం చేస్తున్న సుప్రీంకోర్డు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డేకు లేఖ (CM YS Jagan Writes to CJI) రాసిన సంగతి రాసారు.

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి అండదండలతో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి (Telugu Desam Party (TDP) అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుల ప్రభావం ( files complaint against top SC judge and some judges) ఉందని ఈ లేఖలో సీఎం జగన్ ( CM YS Jagan Mohan Reddy) ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, పడగొట్టడానికి హైకోర్టు న్యాయమూర్తలతో కలిసి ఒక పథకం ప్రకారం ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారని వైయస్ జగన్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు అన్ని ఆధారాలతో కూడిన అంశాలను లేఖతో పాటు జత చేశారు. ఇదిలా ఉంటే గత వారం సిఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీని (PM Modi) కలిసి, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయడంతో సహా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

తన పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో చేరిందనే బలమైన పుకార్ల మధ్య ఎనిమిది నెలల తర్వాత మోడీతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయో లేదో క్లారిటీ లేదు కాని 40 నిమిషాల సమావేశంలో, కడప స్టీల్ ప్లాంట్ వంటి వివిధ ప్రాజెక్టులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు మరియు ఆమోదాలపై వైయస్ జగన్ చర్చించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది.

న్యాయవ్యవస్థతో ఏపీ ప్రభుత్వం ఢీ, ఏపీ హైకోర్టు జడ్జీల తీర్పుల తీరుపై సీజేఐకి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం

సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ (NV Ramana) ప్రధాన సిజెఐ రేసులో ముందువరసలో కూడా ఉన్నారు. జస్టిస్ ఎన్.వి.రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్లపై ప్రభావం చూపుతున్నారని, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి (TDP) సంబంధించిన ముఖ్యమైన కేసులను "కొద్దిమంది ఎంపికైన న్యాయమూర్తులకు" కేటాయించారని ఏపీ సీఎం ఆరోపించారు.టిడిపి నాయకులకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని ఆరోపించిన కేసులను, ముఖ్యమంత్రి కేసులను జాబితా చేసి, పత్రాలను లేఖతో పాటే జత చేశారని తెలుస్తోంది. "రాష్ట్ర న్యాయవ్యవస్థ యొక్క తటస్థతను కొనసాగించేలా చూడటానికి తగిన మరియు సరైనదిగా పరిగణించబడే చర్యలను ప్రారంభించాలని" సిజెఐని ముఖ్యమంత్రి కోరారు.

లేఖలో "వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 మేలో అధికారంలోకి రాగానే ఎన్ చంద్రబాబు నాయుడు పాలన (former chief minister Chandrababu Naidu) (జూన్ 2014 నుండి 2019 మే వరకు) చేసిన అన్ని ఒప్పందాలపై విచారణకు ఆదేశించినప్పటి నుండి, జస్టిస్ ఎన్వి రమణ న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారని వైయస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఢిల్లీలో కలిసిన అదే రోజు అక్టోబర్ 6 న ఈ లేఖ వచ్చింది. అక్టోబర్ 8న సీజేఐకు చేరింది. ఇదిలా ఉంటే కొన్ని వారాల క్రితం ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు.

ఈ లేఖపై పలువురు ప్రముఖులు ట్విటర్‌ ద్వారా స్పందించారు.

సీఎం వర్సెస్‌ సుప్రీంకోర్టు జడ్జి : బార్‌ అండ్‌ బెంచ్‌

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జిలను ప్రభావితం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డేకు లేఖ రాశారు.

ఇప్పుడు స్పష్టమయింది : పాయల్‌ మెహతా

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవహారాలు బహిర్గతం చేసినప్పటి నుంచి ఆయన సన్నిహితుడైన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణ.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి ద్వారా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేశారని ఇప్పుడు స్పష్టమైందని జగన్‌ ప్రధాన సలహాదారు అజేయ కల్లం ఆరోపించారు.

ఏపీలో పెద్ద కథ: రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద కథ నడుస్తోంది. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్‌ జస్టిస్‌ కుటుంబ అవినీతిపై ఒక సీఎం నేరుగా ఆరోపించారు. ఈ కథను నివేదించకుండా హైకోర్టు ఒక వింత గాగ్‌ ఆర్డర్‌ ఇచ్చింది. ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌ దీనిని ప్రజలు, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర : హిందుస్తాన్‌ టైమ్స్‌

తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు, కూల్చి వేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, రాష్ట్ర హైకోర్టు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఆరోపించిందని హిందుస్తాన్‌ టైమ్స్‌ పేర్కొంది. ఈ మేరకు ఆ పత్రిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో ఓ కథనం ప్రచురించింది.

జస్టిస్ రమణపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డేకు లేఖ రాశారు. ఎన్వీ రమణ గతంలో టీడీపీ ప్రభుత్వానికి న్యాయ సలహాదారు, అదనపు అడ్వకేట్ జనరల్ అని ఆ లేఖలో వివరించారు. రాష్ట్ర న్యాయ వ్యవస్థ టీడీపీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తూ.. ఆ పార్టీ ప్రయోజనాల కోసం అవినీతి వ్యవహారాలపై తొలి దశలోనే దర్యాప్తులు జరగకుండా స్టే ఇస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో స్వార్థ ప్రయోజనాలను పరిరక్షించడం కోసం మూడు రాజధానుల బిల్లులను అడ్డుకోవడం సహా తన ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు వరుస తీర్పులు ఇచ్చిందని సీఎం జగన్ పేర్కొన్నారు.

వివిధ దశల్లో దాదాపు 30 ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో (పిల్‌) ముఖ్యమంత్రిని ప్రతివాదిగా పేర్కొన్నారని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ అవినీతిపై తమ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించిన వెంటనే, జస్టిస్ రమణ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి ద్వారా రాష్ట్రంలోని న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపడం ప్రారంభించారని ఆరోపించారు. జస్టిస్ ఎవి శేషసాయి, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ డి రమేష్‌, జస్టిస్‌ కె.లలిత, మరికొంత న్యాయమూర్తులు టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించేలా తీర్పులిచ్చారని ఆరోపించారని తన కధనంలలో పేర్కొంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now