Andhra Pradesh: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ దాఖలు చేయనున్న అమరావతి రైతులు

రాజధాని అమరావతి ప్రాంతంలోపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను నిలువరించాలంటూ రైతులు వేసిన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఇళ్ల స్థలాల కేటాయింపు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.

Credits: Wikimedia Commons

VJY, May 5: రాజధాని అమరావతి ప్రాంతంలోపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను నిలువరించాలంటూ రైతులు వేసిన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఇళ్ల స్థలాల కేటాయింపు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు అయింది. జీవో నెం.45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని, రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికో పరిమితం కాదని.. పిటిషన్‌ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ పదవ తరగతి ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు విడుదల, ఫ‌లితాలను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

రాజధాని ప్రజలందరిది. రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్‌ కాదు. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవే. భూములు వారివి కావు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో.. కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేం. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం విధుల్లో భాగం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది.

జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం, రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు

రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో స్థానికేతరులకు ఇస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీని నిలువరించాలని కోరుతూ అమరావతి రైతులు ఉన్నత న్యాయస్థానంలో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల విచారణ పూర్తిచేసిన హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.మాస్టర్‌ ప్లాన్‌కు భిన్నంగా పట్టాలు ఇవ్వడం సరికాదని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత అక్కడే నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలివ్వాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలువరించాలని అభ్యర్థించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఒప్పందం ప్రకారం రైతులకు రావాల్సిన భూమినే కోరాలి తప్ప.. సీఆర్‌డీఏ, ప్రభుత్వం పరిధిలో ఉన్న భూమిని ఎవరికైనా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే రైతుల పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రేపు (శనివారం) సుప్రీంకోర్టుకు అమరావతి రాజధాని రైతులు వెళ్లనున్నారు. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేయాలని రైతులు నిర్ణయించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

PM Modi Takes Holy Dip at Triveni Sangam: వీడియో ఇదిగో, పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం ఆచరించిన ప్రధాని మోదీ, నేటి వరకు 39 కోట్ల మంది పుణ్యస్నానాలు

Andhra Pradesh: ఏలూరులో దారుణం, ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా రేడియేషన్ తట్టుకోలేక మహిళ మృతి, సుష్మితా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భర్త ఆందోళన

PM Modi Speech in Lok Sabha: పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ

US Begins Deportation of Indian Migrants: అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు కొరడా, భారతీయులను వెనక్కి పంపుతున్న అగ్రరాజ్యం, దాదాపు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లుగా వార్తలు

Share Now