Andhra Pradesh Rains: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్లు సాయం వార్తలన్నీ పుకార్లే, తమకు ఇంకా సమాచారమేమీ రాలేదని తెలిపిన సీఎం చంద్రబాబు

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించిందని వార్తలు వైరల్ అయిన సంగతి విదితమే. రూ. 3,300 కోట్లు ప్రకటించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Chandrababu Naidu (Photo-X/TDP)

Vjy, Sep 6: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించిందని వార్తలు వైరల్ అయిన సంగతి విదితమే. రూ. 3,300 కోట్లు ప్రకటించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం సాయంపై తమకు ఇంకా సమాచారమేమీ రాలేదని వెల్లడించారు. ఏపీ, తెలంగాణకు రూ.3,300 కోట్ల వరద సాయం ప్రకటించారన్నది పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు.

టీడీపీ ఆఫీసుల్లో బాత్రూంల వద్ద కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా ? వైసీపీ నేతల అరెస్ట్‌పై మండిపడిన మాజీ మంత్రి పేర్ని నాని

కేంద్రానికి తాము ఇంకా వర్షాలు, వరదలు, పంట నష్టాలపై ప్రాథమిక నివేదికనే పంపలేదని తెలిపారు. నష్టం తాలూకు అంచనాలతో కూడిన ప్రాథమిక నివేదికను రేపు (సెప్టెంబరు 7) ఉదయం పంపిస్తామని చంద్రబాబు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేనంతగా 11.90 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని... 28 మంది చనిపోయారని వివరించారు. సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. సీఎస్సార్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద సాయం చేయాలని అందరినీ కోరుతున్నామని చెప్పారు. అనేకమంది వచ్చి బాధితులకు సాయం చేస్తున్నారని, ఇలాంటి కష్ట సమయంలో అందరూ ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరుతున్నానని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇళ్లు కోల్పోయిన వారికి ఎంత సాయం చేయగలమో ఆలోచిస్తున్నామని తెలిపారు. బాధితులకు సాయంపై కేంద్రంతోనూ, బ్యాంకర్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. బీమా పాలసీలు ఉన్నవారిని త్వరగా ఆదుకోవాలని కోరుతున్నామని చెప్పారు. ఇక, రేపు వినాయకచవితి పూజను విజయవాడ కలెక్టరేట్ లోనే జరుపుకుంటున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. వినాయక పూజ చేసుకుంటూనే సహాయక చర్యలు కొనసాగిస్తామని అన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now