Andhra Pradesh: చిత్తూరులో విషాదం, టిప్పర్‌కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు, నంద్యాలలో యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరి దారుణ హత్య

ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కంకర తరలిస్తున్న టిప్పర్‌కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి (Three members electrocuted) చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో (Chittoor district) చోటు చేసుకుంది. పాలసముద్రం మండలం కనికాపురంలో జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

Representational Image (Photo Credits: ANI)

Chittoor August 9: ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కంకర తరలిస్తున్న టిప్పర్‌కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి (Three members electrocuted) చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో (Chittoor district) చోటు చేసుకుంది. పాలసముద్రం మండలం కనికాపురంలో జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళ్తే.. కనికాపురంలో ఇల్లు నిర్మించుకుంటున్న మునిస్వామి నాయుడు తన అవసరాల కోసం టిప్పర్‌లో కంకరు తెప్పించారు. కంకరను అన్‌లోడ్‌ చేసే సమయంలో విద్యుత్ తీగలు గమనించని డ్రైవర్ మనోజ్‌‌.. టిప్పర్ వెనక భాగం పైకెత్తాడు. ఈ క్రమంలో టిప్పర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి కరెంట్‌ ప్రవహించింది. దీంతో డ్రైవర్‌ కేకలు వేశాడు. అతడిని కాపాడే క్రమంలో యువకులు జ్యోతీశ్వర్‌, దొరబాబు కూడా విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బీహార్‌‌లో ఆటోను ఢీకొన్న ట్రక్కు, ఐదుగురు అక్కడికక్కడే మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు, మరో రాష్ట్రం యూపీలో సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు బాలికలు మృతి

ఇక కర్నూలు జిల్లాలోని నంద్యాలలో యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరి కేశవులను గుర్తు తెలియని దుండగులు కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుట్కా వ్యాపారులతో కానిస్టేబుల్‌ సంబంధాల ఆడియోను కేశవులు బయటపెట్టాడు. దీంతో కేశవులుపై కానిస్టేబుల్ సుబ్బయ్య పగ పెంచుకుని హత్య చేయించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సుబ్బయ్య పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సుబ్బయ్యతో పాటు అతని తమ్ముడు నాని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

నంద్యాల రిపోర్టర్‌ హత్య కేసు: దర్యాప్తునకు డీజీపీ ఆదేశం

కర్నూలు జిల్లా నంద్యాలలో రిపోర్టర్ కేశవ్‌ హత్య ఘటనపై దర్యాప్తునకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సస్పెండైన కానిస్టేబుల్‌తో పాటు హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ముద్దాయిలను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్‌ చానల్‌ వీ5 విలేకరి కేశవను ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా విలేకరిగా పనిచేస్తున్న అతడిపై కక్షగట్టిన కానిస్టేబుల్‌ సుబ్బయ్య, అతడి సోదరుడు పదునైన ఆయుధంతో వీపు వెనుకభాగంలో పొడిచి హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

APPSC On Group 2 Mains: ఏపీలో గ్రూప్‌ -2 మెయిన్స్‌ పరీక్షలపై సందిగ్ధత, క్లారిటీ ఇచ్చిన ఏపీపీఎస్సీ

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

IPS Officers: ఏపీకి వెళ్లి నేడే రిపోర్ట్ చేయండి.. తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న ముగ్గురు ఏపీ క్యాడ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు కేంద్ర హోంశాఖ‌ ఆదేశాలు

Perni Nani Slams Kollu Ravindra: వీడియో ఇదిగో, బొంగులో నువ్వు చేయిస్తా అంటున్న అరెస్టు వల్ల నా ఒక్క రోమం కూడా ఊడదు, కొల్లు రవీంద్రపై విరుచుకుపడిన పేర్ని నాని

Share Now